News

ముగ్గురు మంత్రుల డిస్మిస్


ఆఫ్గనిస్థాన్ పార్లమెంట్ నుంచి ముగ్గురు మంత్రులు డిస్మిస్ అయ్యారు. విదేశాంగమంత్రి సహా మరో ఇద్దరు కేబినెట్ మంత్రులకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఓటువేసింది. బడ్జెట్ నిధులను అభివృద్ధికి వినియోగించడంలో విపలమవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. విదేశాంగ మంత్రి సలాహుద్దీన్ రబ్బానీ, ప్రజాపనుల మంత్రి మహమూద్ బలిగ్, శ్రామిక, సామాజిక వ్యవహారాల మంత్రి నస్రీన్ ఒర్యాఖెల్‌లపై వేటు పడింది. నో కాన్ఫిడెన్స్ ఓటుతో వారిని తమ పదవుల నుంచి తొలగిస్తూ పార్టమెంటు నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు నిర్ణయాన్ని స్పీకర్ అబ్దుల్ రవూఫ్ ఇబ్రహిమి ప్రకటించారు. తొలగించిన వారి స్థానంలో కొత్తవారిని అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ నియమించాల్సి ఉందని తెలిపారు.